దైవాసుర సంపద్విభాగ యోగంపై ప్రవచనాలు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ప్రాంగణం కళావేదికపై ఆలయ అన్నమయ్య జరుగుల బంగారుబాబు, శివకుమారిల సౌజన్యంతో శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు శుక్రవారంతో ముగిశాయి. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ మానవ జీవితంలో మంచి, చెడుల మధ్య పోరాటాన్ని, దేవుడిని చేరుకోవడానికి దైవిక లక్షణాలను అలవర్చుకోవలసిన అవసరాన్ని ఈ అధ్యాయం నొక్కి చెబుతుందన్నారు. మానవ జీవితంలో మంచి, చెడుల మధ్య పోరాటాన్ని, వాటి పరిణామాలను వివరిస్తుందన్నారు. దైవిక లక్షణాలను అలవరచుకోవడం ద్వారా, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలదని, అసుర లక్షణాలను విడిచిపెట్టడం ద్వారా బంధ విముక్తిని పొందగలడని ఈ అధ్యాయం బోధిస్తుందన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారన్నారు.
వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి