భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు - గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 16.10.2025
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు కిమ్స్ హాస్పటల్స్ వారి సంయుక్త నిర్వహణలో ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. డా. కొల్లి జయకిషన్ MS ORTHO FIJR ( జర్మనీ & సింగపూర్ ) చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, డా . MLV సాయి కృష్ణారెడ్డి MS ఆర్థో ( జిప్మెర్) కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ గార్లచే ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై సలహాలు, సూచనలను తెలియజేశారు.

.jpeg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి