హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు - గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 16.10.2025
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు కిమ్స్ హాస్పటల్స్ వారి సంయుక్త నిర్వహణలో ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. డా. కొల్లి జయకిషన్ MS ORTHO FIJR ( జర్మనీ & సింగపూర్ ) చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, డా . MLV సాయి కృష్ణారెడ్డి MS ఆర్థో ( జిప్మెర్) కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ గార్లచే ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులపై సలహాలు, సూచనలను తెలియజేశారు.

.jpeg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి