హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అలరించిన సంగీత విభావరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం భక్తి సంగీత విభావరి నిర్వహించారు. భక్తిగాన లహరి ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. బోడపాటి శ్రీనివాసరావు బృందంతో పలు భక్తి గీతాలను ఆలపించారు. కీబోర్డుపై సాయి, తబలపై రమణ వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ పాల్గొని బోడపాటి శ్రీనివాసరావునునగా సత్కరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి