ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన ప్రక్రియ హరికథ - 01.09.2025

తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన ప్రక్రియ హరికథ స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవా లయం అన్నమయ్య కళావేదికపై శ్రీఆది భట్ల నారాయణ దాస కథాకరణ కళాపరిషత్ ఆధ్వర్యంలో శ్రీనారాయణ దాస జయంతోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సభ్యులు, సంస్థ నిర్వాహ కులు జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్ ఉప ద్రష్ట వెంకటరమణమూర్తి ప్రసంగిస్తూ ఆది భట్ల నారాయణదాసు తన సాహితీ వైభవాన్ని హరికథకు పునాది వేశారని అన్నారు. ఆయన సంగీతం, సాహిత్యం, నృత్యాలను మేళవించారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన సృష్టించిన హరికథ ప్రక్రియ అద్వితీయమైనదన్నారు. ఆయన ప్రతిభకు, వైభవానికి నిదర్శనమని అన్నారు. కార్యక్ర మాన్ని కర్రా సూర్యనారాయణదాస్ పర్యవేక్షించారు.

భూసురపల్లి ఆదిశేషయ్య ఆదర్శనీయుడు - 30.08.2025

భూసురపల్లి ఆదిశేషయ్య ఆదర్శనీయుడు

డోలు విద్వాంసుడు భూసురపల్లి ఆదిశేషయ్య సంగీత కళాకారులకు ఆదర్శనీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శని వారం రాత్రి ఆదిశేషయ్య పేరున ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు పదో వార్షిక సంస్మరణ, పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహిం చారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళా వేదికపై సభ జరిగింది. తొలుత ఆదిశేషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిశేషయ్య జీవిత విశేషాలను సంగీత విద్వాం సుడు మోదుమూడి సుధాకర్ వివరించారు. అనంతరం భూసురపల్లి ఆదిశే షయ్య కళా పురస్కారాన్ని నాట్యాచార్య కాజ వెంకటసుబ్రహ్మణ్యానికి ఇచ్చి సత్కరించారు. ఆతరువాత శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు త్యాగరాజస్వామి రచించిన నౌకా చరిత్ర యక్షగానాన్ని ప్రదర్శిం చారు. సభకు మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించారు. సభలో రైతు సాధి కార సంస్థ సీఈవో రామారావు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాసరావు, దేవస్థానం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి పాల్గొన్నారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...