ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ - 08.08.2026

సంప్రదాయ కళలతో దేవాలయాలకు మరింత శోభ సంప్రదాయ కళలు దేవాలయాలకు మరింత శోభను తీసుకువస్తాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై నృత్య కిన్నెర ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కూచిపూడి నృత్యోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి నృత్య కళ ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమన్నారు. అనేకమంది నాట్యాచార్యులు దేశ, విదేశాలలో కూచిపూడి నృత్య వైభవాన్ని చాటారన్నారు. సంస్కృతి సంప్రదాయలపై మక్కువ పెంచుకొనే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నృత్య కిన్నెర వారిని ఆయన అభినందించారు. అనంతరం కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రీ నృత్య దర్శకత్వంలో నృత్య కిన్నెర శిష్యబృందం శ్రీ అలమేలు మంగ చరితం కూచిపూడి నృత్య రూపకం, హంసధ్వని కూచిపూడి నృత్యాలయం శిష్య బృందం కూచిపూడి నృత్యమాలిక ప్రేక్షకులను ఆలరించాయి. తొలుత ఈ కార్యక్రమాల్ని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మస్తానయ్య, ప్రముఖ అడిటర్ రామరాజు శ్రీనివాస్ తో కలిసి బొప్పూడి కృష్ణమ...

భూసురపల్లి ఆదిశేషయ్య ఆదర్శనీయుడు - 30.08.2025

భూసురపల్లి ఆదిశేషయ్య ఆదర్శనీయుడు

డోలు విద్వాంసుడు భూసురపల్లి ఆదిశేషయ్య సంగీత కళాకారులకు ఆదర్శనీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శని వారం రాత్రి ఆదిశేషయ్య పేరున ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు పదో వార్షిక సంస్మరణ, పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహిం చారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళా వేదికపై సభ జరిగింది. తొలుత ఆదిశేషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిశేషయ్య జీవిత విశేషాలను సంగీత విద్వాం సుడు మోదుమూడి సుధాకర్ వివరించారు. అనంతరం భూసురపల్లి ఆదిశే షయ్య కళా పురస్కారాన్ని నాట్యాచార్య కాజ వెంకటసుబ్రహ్మణ్యానికి ఇచ్చి సత్కరించారు. ఆతరువాత శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు త్యాగరాజస్వామి రచించిన నౌకా చరిత్ర యక్షగానాన్ని ప్రదర్శిం చారు. సభకు మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించారు. సభలో రైతు సాధి కార సంస్థ సీఈవో రామారావు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాసరావు, దేవస్థానం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి పాల్గొన్నారు.




కామెంట్‌లు