ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అయ్యంకి- వెలగా పురస్కార ప్రదానం - 24.07.2026

అయ్యంకి- వెలగా పురస్కార ప్రదానం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై అన్నమయ్య సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యంకి-వెలగా పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. తొలుత గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వేంకటరమణయ్య , గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య చిత్రపటాలకు అతిధులు పూలమాలలు వేసి నివాళ్ళులు అర్పించారు. గాయకుడు వేల్చూరి శివనాగమల్లేశ్వరారావు అన్నమయ్య సంకీర్తనల గానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు.   అతిథులుగా ఎం.ఎల్.సి. ఆలపాటి రాజేంద్రప్రసాద్, జె.ఎన్.టి.యు. పూర్వ ప్రొఫెసర్ ఆచార్య అయ్యంకి మురళీకృష్ణ, వివా ది స్కూల్ గ్రంథపాలకులు వెలగా మానవేంద్ర, సంస్థ కన్వీనర్ పావులూరి శ్రీనివాసరావు, అన్నమయ్య గ్రంథాలయం గ్రంథాలయాధికారి ఎన్. సుభాషిణి తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ డాక్టర్ డి. చంద్రన్, విశ్రాంత అధ్యాపకులు, సాహితీవేత్త డాక్టర్ బీరం సుందరరావు లను రూ. పదివేల నగదుతోపాటు గ్రంథాలయ సేవా పురస్కారాలతో ప్రద...

నేటితరానికి స్ఫూర్తిప్రదాత గిడుగు - 29.08.2025

నేటితరానికి స్ఫూర్తిప్రదాత గిడుగు

వ్యవహార భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతయని సాహితీవేత్త డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి కొనియాడారు. స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం, సంస్థ వారు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్యలు గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి పూలమా లలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ టి. రాధాబాయి సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి మాట్లాడుతూ సమాజహితం కోసం వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టిన మానవ శాస్త్రవేత్త గిడుగు అని పేర్కొన్నారు. సంస్థ కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి మాట్లాడుతూ నిత్యజీవితంలో మాతృభాష తెలుగు ప్రాధాన్యాన్ని వివరించారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.