భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనృసింహ కవచం అత్యంత పవిత్రం - శ్రీ కె.వి.కోటేశ్వరరావు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై మంగళవారం శ్రీలక్ష్మీ నృసింహ కవచంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ పాలకవర్గం జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కేవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీలక్ష్మీనృసింహ కవచం దుష్టశక్తులు, దుష్ట కన్నులు, ఇతర ఆటం కాల నుంచి రక్షణ పొందేందుకు పఠించే ఒక శక్తివంతమైన స్తోత్రమని అన్నారు.
.jpeg)

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి