హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
శ్రీలక్ష్మీనృసింహ కవచం అత్యంత పవిత్రం - శ్రీ కె.వి.కోటేశ్వరరావు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై మంగళవారం శ్రీలక్ష్మీ నృసింహ కవచంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ పాలకవర్గం జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కేవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీలక్ష్మీనృసింహ కవచం దుష్టశక్తులు, దుష్ట కన్నులు, ఇతర ఆటం కాల నుంచి రక్షణ పొందేందుకు పఠించే ఒక శక్తివంతమైన స్తోత్రమని అన్నారు.
.jpeg)

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి