భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
వైభవంగా స్వామి నగరోత్సవం
శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో స్వామికి ఆలయ అర్చకులు కృష్ణస్వామి అభిషే కం, అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని విశేషంగా ఆలంకరించి, మాఢవీధులలో ఊరే గింపు చేపట్టారు. స్వామి ఊంజలసేవ, తీర్థప్రసాద వితరణ జరగ్గా, భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ పాలకవర్గం కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి