శృంగారనైషదంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై మంగళవారం శృంగారనైషధంలోని నలదమయంతుల చరిత్రపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమం డలి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా. కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ, నలుడు ధైర్యశాలి. గుర్రపు స్వారీలో నిష్ణాతుడు. దాతృత్వ గుణం కలవాడన్నారు. దమయంతి సౌందర్యవతి, బుద్ధిశాలి, దైవభక్తి, పతివ్రత అన్నారు. ఈ ఇద్దరూ తమ సద్గుణాలతో ఒకరినొకరు ఆకర్షించుకొని, ప్రేమ బంధంతో కలిశారన్నారు. ఇద్దరి గుణగణాలు, సద్గుణాలు వారిని ఒకరి పట్ల ఒకరిని ఆకర్షించాయని, దమయంతి నలుని గుణగణాలను విని, అతని పట్ల ప్రేమను పెంచుకుందన్నారు. నలుడు కూడా దమయంతి సౌందర్యం, గుణగణాలను విని ఆమెను ఇష్టపడ్డారని శృంగార నైషధం కావ్య విశిష్టతను తెలియజేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి