అలరించిన వేణుగానం, గాత్ర కచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం వేణుగానం, గాత్ర కచేరి నిర్వహించారు. స్వర తరంగిణి విద్యాల యం(గుంటూరు) ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి, సంస్థ నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీమారెళ్ళ వామనకుమార్ పలు కీర్తనలను వేణు గానంతో పలికించారు. ప్రేక్షకులను అలరించాయి. సువర్ణవిద్య శిష్య బృందం వాగ్గేయకార కీర్తనలను అలపించారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై చావలి కృష్ణమోహన్ వాయిద్యాన్ని అందించారు.
ఆకట్టుకున్న హనుమ సందేశం హరికథాగానం
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని పద్మావతి కల్యాణ వేదికపై శుక్రవారం రాత్రి ఆదిభట్ల నారాయణదాస కథాగాన కళాపరిషత్ ఆధ్వర్యంలో నారాయణదాసు జయంత్యుత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ ముప్పవరపు సింహాచలశాస్త్రి 'హనుమ సందేశం' అనే అంశంపై హరికథాగానం చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి