శ్రీకృష్ణ తత్త్వంపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం శ్రీకృష్ణ త్వత్తముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త మల్లాది కైలాసనాథ్ ప్రవచిస్తూ అన్ని అవతారములలోకి శ్రీకృష్ణావతారము అత్యంత మాధుర్య భరితమైనదన్నారు. కృష్ణుడు అనగా ఆకర్షించేవాడని అర్ధమన్నారు. భగవంతుడు జీవులను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాడన్నారు. కృష్ణపరమాత్మ బాల్యంలో అనేక లీలలను చూపించాడన్నారు.ఈ లీలలను జాగ్రత్తగా పరశీలించినచో వాటిలో చక్కటి అంతరార్ధము, త్వత్తము, సందేశము మనకు బోధపడుతుందన్నారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అని వ్యా సమహర్షి అన్నారని తెలిపారు.
![]() |
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి