భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పాదుకా పట్టాభిషేకం హరికథాగానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని పద్మావతి కళ్యాణవేదికపై శ్రీ ఆదిభట్ల నారాయణదాస కథాగా కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ నారాయణదాస 161వ జయంతోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం సువర్ణ హస్త కంకణ గ్రహీత విజయకుమారి భాగవతారిణి వారిచే పాదుకాపట్టాభిషేకంపై జరిగిన హరికథాగానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయకుమారి హరికథాగానం రూపంలో భక్తులకు రామయణాన్ని వివరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి