అలరించిన వేణుగానం, గాత్ర కచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం వేణుగానం, గాత్ర కచేరి నిర్వహించారు. స్వర తరంగిణి విద్యాల యం(గుంటూరు) ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి, సంస్థ నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీమారెళ్ళ వామనకుమార్ పలు కీర్తనలను వేణు గానంతో పలికించారు. ప్రేక్షకులను అలరించాయి. సువర్ణవిద్య శిష్య బృందం వాగ్గేయకార కీర్తనలను అలపించారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై చావలి కృష్ణమోహన్ వాయిద్యాన్ని అందించారు.
ఆకట్టుకున్న పాదుకా పట్టాభిషేకం హరికథాగానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని పద్మావతి కళ్యాణవేదికపై శ్రీ ఆదిభట్ల నారాయణదాస కథాగా కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ నారాయణదాస 161వ జయంతోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం సువర్ణ హస్త కంకణ గ్రహీత విజయకుమారి భాగవతారిణి వారిచే పాదుకాపట్టాభిషేకంపై జరిగిన హరికథాగానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయకుమారి హరికథాగానం రూపంలో భక్తులకు రామయణాన్ని వివరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి