భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సుబ్బారావు సేవలు ప్రశంసనీయం
రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, విద్య, కళా సాంస్కృతిక రంగాలకు భారీ విరాళాలందిస్తున్న గుళ్లపల్లి సుబ్బారావు సేవలు అభినందనీయమని బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అన్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమ వారం రాత్రి సేవా సంస్థ వ్యవస్థాపకుడు గుళ్లపల్లి సుబ్బారావును పలువురు ఘనంగా సన్మానిం చారు. సన్మాన గ్రహీత సుబ్బారావు మాట్లాడారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి