హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
సుబ్బారావు సేవలు ప్రశంసనీయం
రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, విద్య, కళా సాంస్కృతిక రంగాలకు భారీ విరాళాలందిస్తున్న గుళ్లపల్లి సుబ్బారావు సేవలు అభినందనీయమని బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అన్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమ వారం రాత్రి సేవా సంస్థ వ్యవస్థాపకుడు గుళ్లపల్లి సుబ్బారావును పలువురు ఘనంగా సన్మానిం చారు. సన్మాన గ్రహీత సుబ్బారావు మాట్లాడారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి