సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
సుబ్బారావు సేవలు ప్రశంసనీయం
రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, విద్య, కళా సాంస్కృతిక రంగాలకు భారీ విరాళాలందిస్తున్న గుళ్లపల్లి సుబ్బారావు సేవలు అభినందనీయమని బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అన్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమ వారం రాత్రి సేవా సంస్థ వ్యవస్థాపకుడు గుళ్లపల్లి సుబ్బారావును పలువురు ఘనంగా సన్మానిం చారు. సన్మాన గ్రహీత సుబ్బారావు మాట్లాడారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి