ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 04.12.2026

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.

డాక్టర్ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం ప్రదానం - 12.07.2025

డాక్టర్ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం ప్రదానం

స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో గానకళానిధి వింజమూరి వరదరాజ అయ్యంగార్ జయంతి సం గీత వేడుకలు నిర్వహించారు. వింజమూరి సం ధ్య (చెన్నై), త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్.గిరిజాశంకర్, కార్యదర్శి వల్లూరి కష్ణకిషోర్, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయవాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు సన్మండలి ఉపాధ్యక్షు రాలు డాక్టర్ ఎం.రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు విద్వాన్ ఏఎస్ మురళి (చెన్నై)కి డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం అందించి సత్కరించారు. సభానంతరం ఏఎస్ మురళి శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ్ల లలితాదేవి, కార్యదర్శి ఏ.వీ.మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను అతిథు లను సత్కరించారు.






కామెంట్‌లు