భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
సామాజిక సంక్షేమానికి హోమాలు - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని యాగశాలలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంప తుల ఆధ్వర్యంలో ఆదివారం విశేష హోమాలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా సామాజిక సంక్షేమం కోసం 15 మంది రుత్వికులు లక్ష్మీగణపతి, చండి, రుద్ర హోమాలు చేశారు. చివరగా పూర్ణా హుతి నిర్వహించారు. ఈ క్రతువులో కాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి