సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
సామాజిక సంక్షేమానికి హోమాలు - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని యాగశాలలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంప తుల ఆధ్వర్యంలో ఆదివారం విశేష హోమాలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా సామాజిక సంక్షేమం కోసం 15 మంది రుత్వికులు లక్ష్మీగణపతి, చండి, రుద్ర హోమాలు చేశారు. చివరగా పూర్ణా హుతి నిర్వహించారు. ఈ క్రతువులో కాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి