విశిష్టమైనది మానవజన్మ సమస్త జీవరాశులన్నింటిలో మానవ జన్మ ఎంతో విశిష్టమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు నిష్టల నరసింహమూర్తి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం గురువైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిష్ఠల నరసింహమూర్తి గురు పౌర్ణమి ప్రాధాన్యతను వివరిస్తూ శంకరులును జగద్గురువులు అని ఎందుకు అంటారో వివరించారు. గురువు త్రిమూర్త్యాత్మకుడు అని అనడానికి కారణము, అష్టావక్రుడు, జనకునికి బ్రహ్మోపదేశం చేసిన తీరు వివరించారు. ఏది ఏమైనా గురు ప్రసాద ధన్యత నాస్తి సుఖం మహితలే గురువుగారి అనుగ్రహము కన్నా ప్రపంచంలో సుఖమనేది ఎక్కడ లభించదని తెలియజేశారు.
సామాజిక సంక్షేమానికి హోమాలు - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని యాగశాలలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంప తుల ఆధ్వర్యంలో ఆదివారం విశేష హోమాలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా సామాజిక సంక్షేమం కోసం 15 మంది రుత్వికులు లక్ష్మీగణపతి, చండి, రుద్ర హోమాలు చేశారు. చివరగా పూర్ణా హుతి నిర్వహించారు. ఈ క్రతువులో కాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి