ఆకట్టుకున్నకూచిపూడి నృత్యప్రదర్శన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రముఖ నాట్యా చార్యుడు, వేదాంతం సత్యనారసింహ శాస్త్ర నాట్యా చార్యుడు, వేదాంతం సత్యనార సింహ శిష్యబృందం సాయిశరణ్య శ్రీవైష్ణవి, శ్రీజా వైష్ణవి లు వినాయక కౌతంతో ప్రారంభించి కృష్ణశబ్దం, బృందావన నిలయం, సావిరహే,వినరో భాగ్యము, బాలగోపాల తరంగం, మరకత మణిచేల పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఎ.వి.బ్రహ్మాజి పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి