ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిరుల కల్పవల్లీ వందనం - 26.09.2025

సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి. 

జ్ఞానంతోనే దు:ఖం దూరం అవుతుంది - మానవత ఫౌండర్ ఎన్. రామచంద్రారెడ్డి - 08.06.2025

జ్ఞానంతోనే దు:ఖం దూరం అవుతుంది -  మానవత ఫౌండర్ ఎన్. రామచంద్రారెడ్డి

ఉపనిషత్తులు అందించిన జ్ఞానాన్ని పొందగలిగితే దుఃఖం మానవుని దరిచేరదని మానవతస్వచ్చంద సేవా సంస్థ ఫౌండర్ సెంట్రల్ కమిటీ చైర్మన్ ఎన్. రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మానవత ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణములో గల అన్నమయ్య కళావేదికపై ఉపనిషత్తులపై ఆధ్యాత్మిక ప్రసంగం అనే కార్యక్రమానికి ఎన్. రామచంద్రారెడ్డి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. ఎన్. రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ సృష్టిలో ప్రతిదీ ఏర్పాటు చేసిన తర్వాతనే భగవంతుడు మనిషిని పుట్టించాడని తెలిపారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది, అందువల్లనే బిడ్డకు కూడా తల్లిపై అంతటి ప్రేమ కలుగుతుందని, త్యాగం ప్రేమకు చిహ్నమని పేర్కొన్నారు. అవసరానికి మించి ఉన్న ధనం సమస్యలను తెచ్చిపెడుతుందని, ఆర్థిక చింతలను వీడి మానవుడు ధర్మబద్ధంగా నడుచుకోవాలని, శాంతి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేత్రశరీర అవయవ దాన కమిటీ చైర్మన్ టి. సుందరరామయ్య అవయవ ఆవశ్యకత గురించి సభికులకు తెలిపారు.. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. చైర్మన్ పావులూరి రమేష్ సంస్థ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను వివరిస్తూ నగర వాసులు ముందుకొచ్చి మానవతలో సభ్యులుగా చేరమని కోరారు. ఆద్యంతం అహ్లాదకరంగా జరిగిన కార్యక్రమంలో మానవత రాష్ట్ర అధ్యక్షులు ఎ. రామానుజులు రెడ్డి, గుంటూరు కార్యదర్శి కె. సతీష్, కోశాధికారి టీ.వీసాయిరాం, డైరెక్టర్లు ఉప్పలసాంబశివరావు, బి.ఎన్ మిత్ర, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.