భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
భక్తితోనే పురుషోత్తమప్రాప్తి
అనన్య భక్తితోనే పరమాత్ముడైన పురుషోత్తముని చేరవ చ్చని చిన్మయ మిషన్ సువీరానంద స్వామి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవద్గీత 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తియోగంపై ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానందస్వామి ప్రవచనాలు చెప్తూ.. భక్తి ద్వారా త్రిగుణాలు దాటవచ్చని, బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చని వివరించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి