హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
భక్తితోనే పురుషోత్తమప్రాప్తి
అనన్య భక్తితోనే పరమాత్ముడైన పురుషోత్తముని చేరవ చ్చని చిన్మయ మిషన్ సువీరానంద స్వామి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవద్గీత 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తియోగంపై ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానందస్వామి ప్రవచనాలు చెప్తూ.. భక్తి ద్వారా త్రిగుణాలు దాటవచ్చని, బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చని వివరించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి