ఆకట్టుకున్నకూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం ప్రదర్శించిన నృత్యకిన్నెర, హైదరాబాద్ వారి కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సభ్యులు, సంస్థవారు జ్యోతిప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు, హంస అవార్డు గ్రహీత గురు డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి శిష్యబృందం యశస్వినిశ్రీ, శ్రద్ధ వారణాసి,సహస్ర, చెరిష్య, కార్తీక, ప్రణీత, చాతుర్యశ్రీ లు వినరో భాగ్యము విష్ణుకథతో ప్రారంభించి శ్రీమన్నారాయణ, నారాయణతే నమో నమో పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి రసజ్ఞులను ఆకట్టుకున్నారు.
భక్తితోనే పురుషోత్తమప్రాప్తి
అనన్య భక్తితోనే పరమాత్ముడైన పురుషోత్తముని చేరవ చ్చని చిన్మయ మిషన్ సువీరానంద స్వామి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవద్గీత 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తియోగంపై ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానందస్వామి ప్రవచనాలు చెప్తూ.. భక్తి ద్వారా త్రిగుణాలు దాటవచ్చని, బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చని వివరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి