ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి స్థానిక బృందావన్గార్డెవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ పాకిస్థాన్ యుద్ధంలో భారత దేశమే పైచేయి కావాలని అన్నారు. కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. భాగవత గోష్ఠితో మూడుసార్లు ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారని అన్నారు. అనంతరం శృం గార నైషధంలోని ఇతివృత్తాన్ని వివరించారు.
ఆకట్టుకున్న సాహిత్య సభ
బృందావన్ గార్డెన్స్
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేది కపై సీనియర్ సిటిజన్స్
వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ ఆదివారం నిర్వహించారు.
తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు విజయబాబు, విద్యావేత్త నూతలపాటి
తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ భక్తి, వైదేహి నరసింహ జయంతి భక్త
రక్షణకు భగవం తుడు అవతరించిన విధానాన్ని వివరించారు. ముఖ్యఅతిథి డాక్టర్ ఆరెటి
కృష్ణకుమారి తల్లి శిక్షణలో పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
కార్యక్రమాన్ని కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి నిర్వ హించారు.
కార్యక్రమంలో డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి, సామ్రాజ్యం, షేక్ కాసింబి తదితరులు పాల్గొ న్నారు. కుమారి జాహ్నవి
బృందం భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి