కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
ఆకట్టుకున్న సాహిత్య సభ
బృందావన్ గార్డెన్స్
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేది కపై సీనియర్ సిటిజన్స్
వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ ఆదివారం నిర్వహించారు.
తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు విజయబాబు, విద్యావేత్త నూతలపాటి
తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ భక్తి, వైదేహి నరసింహ జయంతి భక్త
రక్షణకు భగవం తుడు అవతరించిన విధానాన్ని వివరించారు. ముఖ్యఅతిథి డాక్టర్ ఆరెటి
కృష్ణకుమారి తల్లి శిక్షణలో పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
కార్యక్రమాన్ని కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి నిర్వ హించారు.
కార్యక్రమంలో డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి, సామ్రాజ్యం, షేక్ కాసింబి తదితరులు పాల్గొ న్నారు. కుమారి జాహ్నవి
బృందం భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి