మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాహిత్య సభ
బృందావన్ గార్డెన్స్
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేది కపై సీనియర్ సిటిజన్స్
వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ ఆదివారం నిర్వహించారు.
తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు విజయబాబు, విద్యావేత్త నూతలపాటి
తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ భక్తి, వైదేహి నరసింహ జయంతి భక్త
రక్షణకు భగవం తుడు అవతరించిన విధానాన్ని వివరించారు. ముఖ్యఅతిథి డాక్టర్ ఆరెటి
కృష్ణకుమారి తల్లి శిక్షణలో పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
కార్యక్రమాన్ని కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి నిర్వ హించారు.
కార్యక్రమంలో డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి, సామ్రాజ్యం, షేక్ కాసింబి తదితరులు పాల్గొ న్నారు. కుమారి జాహ్నవి
బృందం భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి