భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాహిత్య సభ
బృందావన్ గార్డెన్స్
శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేది కపై సీనియర్ సిటిజన్స్
వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ ఆదివారం నిర్వహించారు.
తొలుత ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు విజయబాబు, విద్యావేత్త నూతలపాటి
తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ భక్తి, వైదేహి నరసింహ జయంతి భక్త
రక్షణకు భగవం తుడు అవతరించిన విధానాన్ని వివరించారు. ముఖ్యఅతిథి డాక్టర్ ఆరెటి
కృష్ణకుమారి తల్లి శిక్షణలో పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
కార్యక్రమాన్ని కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి నిర్వ హించారు.
కార్యక్రమంలో డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి, సామ్రాజ్యం, షేక్ కాసింబి తదితరులు పాల్గొ న్నారు. కుమారి జాహ్నవి
బృందం భక్తి గీతాలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు.







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి