సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
అలరించిన కీర్తనల గానం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గరి మెళ్ల బాలకృష్ణప్రసాద్ స్మృత్యంజలి కీర్తనల గానం శనివారం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చింతలపాటి రమాగోపాలకృష్ణ, పావని, నాగలక్ష్మి అన్నమాచార్య విరచిత కీర్తనల గానం చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి