ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి - 28,29.05.2025

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి స్థానిక బృందావన్గార్డెవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ పాకిస్థాన్ యుద్ధంలో భారత దేశమే పైచేయి కావాలని అన్నారు. కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. భాగవత గోష్ఠితో మూడుసార్లు ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారని అన్నారు. అనంతరం శృం గార నైషధంలోని ఇతివృత్తాన్ని వివరించారు. 

దార్శనికుడు డాక్టర్ కొండబోలు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం - 06.05.2025

దార్శనికుడు డాక్టర్ కొండబోలు  జీవన సాఫల్య పురస్కారం ప్రదానం

ప్రముఖ వైద్యుడిగా ఆరు దశాబ్దాలకు పైగా, విద్యాప్రదాతగా డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య నిలిచారని డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణయ్య అన్నారు. బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై మంగళవారం గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ కొండబోలు బసవపున్నయ్యకు జీవన సాఫల్య పురస్కారం అందించారు. తొలుత పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేయగా, సభకు డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ఐదు దశాబ్దాలకు పైగా కమ్మ వసతిగృహం అధ్యక్షుడిగా కొనసాగారని అన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులేశారని అన్నారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా జేకేసీ కళాశాల, ఆర్వోఆర్ ఇంజినీరింగ్ కళాశాల, హనుమయ్య ఫార్మసీ కళాశాల, మాదల శకుం తల భాస్కర్ నర్సింగ్ కళాశాలల స్థాపనతోపాటు కేఎల్పీ పబ్లిక్ స్కూల్ అధ్యక్షునిగా ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. ఆయన మాతృమూర్తి పేరుతో వృద్ధుల ఆశ్రమం స్థాపించి, ఇతోధికంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. సీనియర్ వైద్యులు యర్రా నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బసవపున్నయ్య ఆర్థిక రంగ నిపుణులుగా, విశ్లేషకుడిగా అనేక మందికి మార్గదర్శ కులుగా నిలిచారని అన్నారు. అధ్యక్షత వహించిన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ బోలు బసవపున్నయ్య అని అన్నారు. పెద్ది సాంబశివరావు రాసిన వైద్య నిఘంటువుని డాక్టర్ అర్ధలపూడి సృజన్కుమార్ ఆవిష్కరించారు. అనంతరం శ్రావ్య, శాన్వి కర్రసాము నృత్య ప్రద ర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సేవ సంస్థ కన్వీనర్ గుళ్లపల్లి రాఘవేంద్రరావు, నిర్వహణ డాక్టర్ చిట్టినేని శివకోటేశ్వరావు, మోదుగల రవికృష్ణ, డాక్టర్ బసవపున్నయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...