హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అలరించిన చిన్నారుల గాత్ర కచేరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై సోమవారం మాస్టర్స్ మ్యూజిక్ అకాడమీ తొమ్మిదో వార్షికోత్సవం నిర్వహించారు. పాలక మండలి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహా కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారులు గాత్రం, కీబోర్డు, గిటార్, వయోలిన్ నిర్వహించారు. సభికులను అల రించాయి. కార్యక్రమంలో రాజేంద్ర, అజేంద్ర పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి