సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
అలరించిన చిన్నారుల గాత్ర కచేరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై సోమవారం మాస్టర్స్ మ్యూజిక్ అకాడమీ తొమ్మిదో వార్షికోత్సవం నిర్వహించారు. పాలక మండలి అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహా కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారులు గాత్రం, కీబోర్డు, గిటార్, వయోలిన్ నిర్వహించారు. సభికులను అల రించాయి. కార్యక్రమంలో రాజేంద్ర, అజేంద్ర పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి