హనుమంతుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని, తద్వారా యువత విజయం సాధించవచ్చని ప్రవచనకర్త మల్లాది కైలాసనాథ్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం ఆధ్యాతి ్మక ప్రవచనం చేశారు. ఆలయ కమిటీ అధ్య క్షులు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. మల్లాది కైలాష్ నాథ్ ప్రసంగిస్తూ హనుమంతుడు మహాజ్ఞాని వీరుడు అని చెప్పారు. శ్రీరామునికి బంటుగా అతనికి మేలు కలగాలని ఉద్దేశంతో అత్యుత్తమంగా పని చేశాడని తెలిపారు.హనుమంతుడి హృద యపూర్వకమైన భక్తిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
అలరించిన భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన భక్తిగీతాలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి బృందం నారాయణ నీ నామమే, శ్రీలక్ష్మీదేవి, కృష్ణమ్మా గోపాల బాలా, అన్ని రూపములకు నీవే తదితర కీర్తనలు ఆలపించారు. తబలపై పి. బాలాజీ, కీబోర్డుపై కె.రవి చక్కటి వాద్య సహకారం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి