సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
అలరించిన భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన భక్తిగీతాలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి బృందం నారాయణ నీ నామమే, శ్రీలక్ష్మీదేవి, కృష్ణమ్మా గోపాల బాలా, అన్ని రూపములకు నీవే తదితర కీర్తనలు ఆలపించారు. తబలపై పి. బాలాజీ, కీబోర్డుపై కె.రవి చక్కటి వాద్య సహకారం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి