భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన భక్తిగీతాలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి బృందం నారాయణ నీ నామమే, శ్రీలక్ష్మీదేవి, కృష్ణమ్మా గోపాల బాలా, అన్ని రూపములకు నీవే తదితర కీర్తనలు ఆలపించారు. తబలపై పి. బాలాజీ, కీబోర్డుపై కె.రవి చక్కటి వాద్య సహకారం అందించారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి