మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.
అలరించిన భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన భక్తిగీతాలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి బృందం నారాయణ నీ నామమే, శ్రీలక్ష్మీదేవి, కృష్ణమ్మా గోపాల బాలా, అన్ని రూపములకు నీవే తదితర కీర్తనలు ఆలపించారు. తబలపై పి. బాలాజీ, కీబోర్డుపై కె.రవి చక్కటి వాద్య సహకారం అందించారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి