హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
భక్తిశ్రద్ధలతో శంకరాచార్య, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శంకరాచార్యులు, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు జరిగాయి. స్వామి వార్లకు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులతో దేవాలయ పాలకమండలి నిర్వహించింది. అన్నమయ్య కళావేదికపై సత్సంగ సభ్యులతో అష్టోత్తర శతనామావళిః పారాయణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టగా, తోట నరసింహారావు సౌజన్యంతో జొన్నా శివనాగేశ్వరరావు సుందరకాండ పారాయణం నిర్వ హించారు. వీరికి తబలపై ఎస్. వెంకట్, కీబోర్డుపై డి.రామకృష్ణ వాయిద్యాన్ని అందించారు.
![]() |
.jpeg)
.jpeg)





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి