కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.
భక్తిశ్రద్ధలతో శంకరాచార్య, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శంకరాచార్యులు, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు జరిగాయి. స్వామి వార్లకు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులతో దేవాలయ పాలకమండలి నిర్వహించింది. అన్నమయ్య కళావేదికపై సత్సంగ సభ్యులతో అష్టోత్తర శతనామావళిః పారాయణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టగా, తోట నరసింహారావు సౌజన్యంతో జొన్నా శివనాగేశ్వరరావు సుందరకాండ పారాయణం నిర్వ హించారు. వీరికి తబలపై ఎస్. వెంకట్, కీబోర్డుపై డి.రామకృష్ణ వాయిద్యాన్ని అందించారు.
![]() |
.jpeg)
.jpeg)





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి