భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శంకరాచార్య, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం శంకరాచార్యులు, రామానుజాచార్యుల జయంత్యుత్సవాలు జరిగాయి. స్వామి వార్లకు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులతో దేవాలయ పాలకమండలి నిర్వహించింది. అన్నమయ్య కళావేదికపై సత్సంగ సభ్యులతో అష్టోత్తర శతనామావళిః పారాయణం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టగా, తోట నరసింహారావు సౌజన్యంతో జొన్నా శివనాగేశ్వరరావు సుందరకాండ పారాయణం నిర్వ హించారు. వీరికి తబలపై ఎస్. వెంకట్, కీబోర్డుపై డి.రామకృష్ణ వాయిద్యాన్ని అందించారు.
![]() |
.jpeg)
.jpeg)





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి