ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హరిహరాత్మకమైనది కార్తీకం - 19.11.2025

హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ  శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.

ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం

ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం

నాలుగు దశాబ్దాలుగా భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు కృషి

ధర్మ ప్రచారం, ధార్మిక సేవలే లక్ష్యంగా సాగుతూ.. ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోంది. గుంటూరులోని భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.. పరిషత్తు ఆధ్వర్యంలో యజ్ఞ యాగాలే కాక భార తీయ సనాతన ధర్మానికి పట్టుకొమ్మల్లాంటి రామాయణ, మహాభారతాల్లాంటి ఇతిహాసాలు, మంత్ర శాస్త్ర గ్రంథాలు తదితరాలపై ప్రముఖ పండితులతో పరిశోధనాత్మక వ్యాసాలు రాయించి పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అన్నదానాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా భారతీయుల ఆదర్శ జీవన విధానం, దాని విలువలు నేటి తరానికి తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. భారతీ ధార్మిక పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షుడు బౌల్లేపల్లి సత్యనారాయణ. 



బొల్లేపల్లి సత్యనారాయణ 1995, ఫిబ్రవరి 5న శృంగేరీ పీఠాధిపతుల సూచనతో పరిషత్తును స్థాపించారు. భార్య లలితాంబ చేదోడువాదోడుగా సహస్ర చండీయాగాలు, లలితా, విష్ణు, హనుమాన్ చాలీసా పారాయణలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ లోక సంరక్షణ, అమరావతి రాజధానిగా వెలుగొందాలని, ఆంధ్ర ప్రాంతం సుభిక్షంగా నిలవాలన్న సంకల్పం ఉండడం విశేషం. రాష్ట్ర రాష్టేతర ప్రాంతాల్లోని వందల సంఖ్యలో పారా యణలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు. 

పీఠాధిపతులు, ఆశ్రమాధిపతుల ప్రబోధాలు

పరిషత్ ప్రారంభించిన నాటి నుంచి తొలుత అశోక్ నగర్‌లో ఆయన నివాసంలోని సువిశాల ప్రాంగణాన్ని ధార్మిక ప్రాంగణంగా మలచి ఎందరెందరో ప్రముఖ పీఠాధిపతులు, ఆశ్రమా దిపతులను ఆహ్వానించి వారితో ప్రబోధ కార్య క్రమాలు నిర్వహించారు. అనంతర బృందావన్.. గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుబంధంగా ధార్మిక ప్రాంగణంలో యాగశాలను ప్రత్యేకంగా నిర్మింపజేసి అరుదైన యజ్ఞ, యాగాలు, హోమాలను వేదపండితులతో నిర్వహింపజేస్తున్నారు. 







పుస్తక ప్రచురణలు.. అన్నదానం 

భారతీయ సనాతన ధర్మానికి పట్టుగొమ్మ ల్లాంటి వాజ్ఞయాన్ని పరిశోధనాత్మక రీతిలో ప్రచురించడం మరో విశేషం, రామాయణ వైజ యంతి, మహాభారత వైజయంతి, చండీ సప్తశతి, గణపతి తత్వ వైభవం, ఆదిత్య వైభవం తదితర అంశాల్లో సుప్రసిద్ధ పండితులతో పరిశో ధనాత్మకంగా వ్యాసాలు రాయించి దాదాపు వందకు పైగా గ్రంథాలను ప్రచురించారు. బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న ధార్మిక ప్రాంగణంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప, భవానీ తదితర దీక్షాపరు లకు ఏటా అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు.














కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.