ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిరుల కల్పవల్లీ వందనం - 26.09.2025

సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి. 

ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం

ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం

నాలుగు దశాబ్దాలుగా భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు కృషి

ధర్మ ప్రచారం, ధార్మిక సేవలే లక్ష్యంగా సాగుతూ.. ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోంది. గుంటూరులోని భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.. పరిషత్తు ఆధ్వర్యంలో యజ్ఞ యాగాలే కాక భార తీయ సనాతన ధర్మానికి పట్టుకొమ్మల్లాంటి రామాయణ, మహాభారతాల్లాంటి ఇతిహాసాలు, మంత్ర శాస్త్ర గ్రంథాలు తదితరాలపై ప్రముఖ పండితులతో పరిశోధనాత్మక వ్యాసాలు రాయించి పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అన్నదానాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా భారతీయుల ఆదర్శ జీవన విధానం, దాని విలువలు నేటి తరానికి తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. భారతీ ధార్మిక పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షుడు బౌల్లేపల్లి సత్యనారాయణ. 



బొల్లేపల్లి సత్యనారాయణ 1995, ఫిబ్రవరి 5న శృంగేరీ పీఠాధిపతుల సూచనతో పరిషత్తును స్థాపించారు. భార్య లలితాంబ చేదోడువాదోడుగా సహస్ర చండీయాగాలు, లలితా, విష్ణు, హనుమాన్ చాలీసా పారాయణలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ లోక సంరక్షణ, అమరావతి రాజధానిగా వెలుగొందాలని, ఆంధ్ర ప్రాంతం సుభిక్షంగా నిలవాలన్న సంకల్పం ఉండడం విశేషం. రాష్ట్ర రాష్టేతర ప్రాంతాల్లోని వందల సంఖ్యలో పారా యణలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు. 

పీఠాధిపతులు, ఆశ్రమాధిపతుల ప్రబోధాలు

పరిషత్ ప్రారంభించిన నాటి నుంచి తొలుత అశోక్ నగర్‌లో ఆయన నివాసంలోని సువిశాల ప్రాంగణాన్ని ధార్మిక ప్రాంగణంగా మలచి ఎందరెందరో ప్రముఖ పీఠాధిపతులు, ఆశ్రమా దిపతులను ఆహ్వానించి వారితో ప్రబోధ కార్య క్రమాలు నిర్వహించారు. అనంతర బృందావన్.. గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుబంధంగా ధార్మిక ప్రాంగణంలో యాగశాలను ప్రత్యేకంగా నిర్మింపజేసి అరుదైన యజ్ఞ, యాగాలు, హోమాలను వేదపండితులతో నిర్వహింపజేస్తున్నారు. 







పుస్తక ప్రచురణలు.. అన్నదానం 

భారతీయ సనాతన ధర్మానికి పట్టుగొమ్మ ల్లాంటి వాజ్ఞయాన్ని పరిశోధనాత్మక రీతిలో ప్రచురించడం మరో విశేషం, రామాయణ వైజ యంతి, మహాభారత వైజయంతి, చండీ సప్తశతి, గణపతి తత్వ వైభవం, ఆదిత్య వైభవం తదితర అంశాల్లో సుప్రసిద్ధ పండితులతో పరిశో ధనాత్మకంగా వ్యాసాలు రాయించి దాదాపు వందకు పైగా గ్రంథాలను ప్రచురించారు. బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న ధార్మిక ప్రాంగణంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప, భవానీ తదితర దీక్షాపరు లకు ఏటా అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు.














కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.