ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు  బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీన అంకురారోపణతో ప్రారం భమై, 12న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల శ్రీవారి దివ్య శాంతి కల్యాణోత్సవం, 13న మేళతాళాలు, జానపద కళా రూపాలతో అపూర్వ రథోత్సవం, 14న చండీ హోమం, పూర్ణాహుతి, అన్న సమారాధన, శ్రీపద్మావతి అమ్మవారికి విశేష అభిషేకాలు, శ్రీపుష్పయాగం, పవళింపు సేవ వంటి కార్యక్రమాలు జరుగు తాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, స్వామిజీలు, పీఠాధిపతులు, అధికారులు హాజరవుతారని తెలిపారు. 

ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం

ధర్మ రక్షణే ధ్యేయం.. ధార్మిక సేవే లక్ష్యం

నాలుగు దశాబ్దాలుగా భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు కృషి

ధర్మ ప్రచారం, ధార్మిక సేవలే లక్ష్యంగా సాగుతూ.. ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోంది. గుంటూరులోని భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.. పరిషత్తు ఆధ్వర్యంలో యజ్ఞ యాగాలే కాక భార తీయ సనాతన ధర్మానికి పట్టుకొమ్మల్లాంటి రామాయణ, మహాభారతాల్లాంటి ఇతిహాసాలు, మంత్ర శాస్త్ర గ్రంథాలు తదితరాలపై ప్రముఖ పండితులతో పరిశోధనాత్మక వ్యాసాలు రాయించి పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. అన్నదానాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా భారతీయుల ఆదర్శ జీవన విధానం, దాని విలువలు నేటి తరానికి తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. భారతీ ధార్మిక పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షుడు బౌల్లేపల్లి సత్యనారాయణ. 



బొల్లేపల్లి సత్యనారాయణ 1995, ఫిబ్రవరి 5న శృంగేరీ పీఠాధిపతుల సూచనతో పరిషత్తును స్థాపించారు. భార్య లలితాంబ చేదోడువాదోడుగా సహస్ర చండీయాగాలు, లలితా, విష్ణు, హనుమాన్ చాలీసా పారాయణలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ లోక సంరక్షణ, అమరావతి రాజధానిగా వెలుగొందాలని, ఆంధ్ర ప్రాంతం సుభిక్షంగా నిలవాలన్న సంకల్పం ఉండడం విశేషం. రాష్ట్ర రాష్టేతర ప్రాంతాల్లోని వందల సంఖ్యలో పారా యణలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు. 

పీఠాధిపతులు, ఆశ్రమాధిపతుల ప్రబోధాలు

పరిషత్ ప్రారంభించిన నాటి నుంచి తొలుత అశోక్ నగర్‌లో ఆయన నివాసంలోని సువిశాల ప్రాంగణాన్ని ధార్మిక ప్రాంగణంగా మలచి ఎందరెందరో ప్రముఖ పీఠాధిపతులు, ఆశ్రమా దిపతులను ఆహ్వానించి వారితో ప్రబోధ కార్య క్రమాలు నిర్వహించారు. అనంతర బృందావన్.. గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అనుబంధంగా ధార్మిక ప్రాంగణంలో యాగశాలను ప్రత్యేకంగా నిర్మింపజేసి అరుదైన యజ్ఞ, యాగాలు, హోమాలను వేదపండితులతో నిర్వహింపజేస్తున్నారు. 







పుస్తక ప్రచురణలు.. అన్నదానం 

భారతీయ సనాతన ధర్మానికి పట్టుగొమ్మ ల్లాంటి వాజ్ఞయాన్ని పరిశోధనాత్మక రీతిలో ప్రచురించడం మరో విశేషం, రామాయణ వైజ యంతి, మహాభారత వైజయంతి, చండీ సప్తశతి, గణపతి తత్వ వైభవం, ఆదిత్య వైభవం తదితర అంశాల్లో సుప్రసిద్ధ పండితులతో పరిశో ధనాత్మకంగా వ్యాసాలు రాయించి దాదాపు వందకు పైగా గ్రంథాలను ప్రచురించారు. బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న ధార్మిక ప్రాంగణంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప, భవానీ తదితర దీక్షాపరు లకు ఏటా అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు.














కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...