ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు - 08,09.07.2026

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ  గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.

ఉపదేశపూర్వక విష్ణు సహస్రనామ పారాయణ - 08.02.2025

ఉపదేశపూర్వక విష్ణు సహస్రనామ పారాయణ

భీష్మ ఏకాదశి సందర్భంగా బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై సామూహిక విష్ణు సహస్రనామ పారా యణ శనివారం జరిగింది. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, దేవాలయ పాలకమండలి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి సత్సంగ బృందం ఉపదేశపూర్వక సామూ హిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వ హించారు. కార్యక్రమంలో సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరత్నను నిర్వాహకులు సత్కరించారు.













కామెంట్‌లు