ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిరుల కల్పవల్లీ వందనం - 26.09.2025

సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి. 

మంచి సాహిత్యంతో సమాజానికి దిశానిర్దేశం - 07.02.2025

మంచి సాహిత్యంతో సమాజానికి దిశానిర్దేశం

మంచి సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికపై రావి రంగారావు సాహిత్య పీఠం. ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జన రంజక కవి ప్రతిభా పురస్కార ప్రధాన సభ జరిగింది. సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కవులు కాలానికి కూడా దిశా నిర్దేశకులన్నారు. 11 ఏళ్లుగా జనానికి పనికొచ్చే కవుల్ని గుర్తించి పురస్కారాలిస్తున్న రావి రంగారావు సాహిత్య పీఠం కృషి ఎనలేనిదన్నారు. గ్రంథాలయ సెస్సును గ్రంథాలయాలకే వినియోగించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యావేత్త గద్దె మంగయ్య అధ్యక్షత వహించిన సభలో రాజమండ్రి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, యణ, పీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు, పోటీకి వచ్చిన వందకు పైగా కవిత్వ గ్రంథాల్లో ఎంపికైన నాలుగు పుస్తకాల కవులకు పురస్కారాలు అందించారు. ‘నాన్న ఎందుకో వెనక బడ్డాడు’ పుస్తక కవి ప్రకాశ్ నాయుడు, ‘అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి’ కవి లేదాళ్ల రాజేశ్వరరావు, ‘గాజా లేని జాగా’ కవి నేలపూరి రత్నాజీలను అతిథులు శాలువాలు, జ్ఞాపికలు రూ.2 వేలు నగదుతో సత్కరించారు. పుష్ప మంజరి పద్యాల సంపుటి రాసిన గుమ్మా నాగమంజరి పక్షాన రాజ్యలక్ష్మి పురస్కారం అందుకున్నారు. తొలుత దేవాలయ పాలక మండలి. అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఠం డైరెక్టరు డాక్టర్ రావి ఆరుణ, డాక్టర్ మైలవరపు లలితకుమారి, గడల శివప్రసాద్, కొల్లు నాగేంద్రం, పీఠం కన్వీనర్ నర్రా ప్రభావతి తదితరులు ప్రసంగించారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.