ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు - 08,09.07.2026

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ  గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.

మంచి సాహిత్యంతో సమాజానికి దిశానిర్దేశం - 07.02.2025

మంచి సాహిత్యంతో సమాజానికి దిశానిర్దేశం

మంచి సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికపై రావి రంగారావు సాహిత్య పీఠం. ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జన రంజక కవి ప్రతిభా పురస్కార ప్రధాన సభ జరిగింది. సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కవులు కాలానికి కూడా దిశా నిర్దేశకులన్నారు. 11 ఏళ్లుగా జనానికి పనికొచ్చే కవుల్ని గుర్తించి పురస్కారాలిస్తున్న రావి రంగారావు సాహిత్య పీఠం కృషి ఎనలేనిదన్నారు. గ్రంథాలయ సెస్సును గ్రంథాలయాలకే వినియోగించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యావేత్త గద్దె మంగయ్య అధ్యక్షత వహించిన సభలో రాజమండ్రి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, యణ, పీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ రంగారావు, పోటీకి వచ్చిన వందకు పైగా కవిత్వ గ్రంథాల్లో ఎంపికైన నాలుగు పుస్తకాల కవులకు పురస్కారాలు అందించారు. ‘నాన్న ఎందుకో వెనక బడ్డాడు’ పుస్తక కవి ప్రకాశ్ నాయుడు, ‘అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి’ కవి లేదాళ్ల రాజేశ్వరరావు, ‘గాజా లేని జాగా’ కవి నేలపూరి రత్నాజీలను అతిథులు శాలువాలు, జ్ఞాపికలు రూ.2 వేలు నగదుతో సత్కరించారు. పుష్ప మంజరి పద్యాల సంపుటి రాసిన గుమ్మా నాగమంజరి పక్షాన రాజ్యలక్ష్మి పురస్కారం అందుకున్నారు. తొలుత దేవాలయ పాలక మండలి. అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఠం డైరెక్టరు డాక్టర్ రావి ఆరుణ, డాక్టర్ మైలవరపు లలితకుమారి, గడల శివప్రసాద్, కొల్లు నాగేంద్రం, పీఠం కన్వీనర్ నర్రా ప్రభావతి తదితరులు ప్రసంగించారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.