వైభవంగా వీణాఝరి
బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి వీణామరి కార్యక్రమం వైభవంగా జరిగింది. రామరాజు పౌండేషన్, రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ నిర్వహణలో సంస్థ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాస్ దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం కళాని పంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఆర్.లక్ష్మి శ్రీనివాస్ వీణ కచేరీలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎ. భారతీదేవి, బి. వంశీకృష్ణ, అయ్యగారి సత్యప్రసాద్, కె. శశిధర్, కె. హేమలక్ష్మి, ఎస్వీఎస్ కేఎస్ గోవిందరాజన్, బి. మధురిమ వీణ కచేరీలు చేశారు. ప్రధాన కచేరీలో భాగంగా ప్రముఖ వీణ విద్వాంసుడు సుడు వడలి ఫణినారాయణ వీణ కచేరీ చేశారు. వడలి ఫణి నారాయణకు పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కారాన్ని రామరాజు శ్రీనివాస్ దంపతులు, ముఖ్యఅతిథిగా పొల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, డాక్టర్ భూసురపల్లి వెంక టేశ్వర్లు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్యలు ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం వీణాఝరిలో పాల్గొన్న వీణా విద్వాంసులు, వాద్య కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి