ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆత్మవిజ్ఞానమే ఓంకార మహాయజ్ఞం - సుమిత్రానంద సరస్వతీ మాతాజీ - 05.02.2025

ఆత్మవిజ్ఞానమే ఓంకార మహాయజ్ఞం ఆత్మ విజ్ఞానమే ఓంకార మహాయజ్ఞమని ప్రణవఆశ్రమం, కాకినాడ వ్యవస్థాపకులు సుమిత్రానంద సరస్వతీ మాతాజీ అన్నారు.  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ఓంకార మహాయజ్ఞం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన సంస్కృతి సంప్రదాయాలను పక్కన పెట్టినప్పుడే మన విలువలు పడిపోతున్నాయన్నారు. భవిషత్ తరానికి మనమే మందిస్తామనే విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలన్నారు. ఆలయం సందర్శించినప్పుడు పాదరక్షలు బయట వదులుతాం కాని సెల్‌ఫోన్లు మాత్రం ఎటువంటి పరిస్థితులలో వదలటలేదన్నారు. ఎన్నోజన్మల పుణ్యమే మానవ జన్మ పొందటమని అందులోను అత్యంత పుణ్యఫలం భారతదేశంలో జన్మించటమన్నారు. కార్యక్రమాన్ని కొమ్మినేని లక్ష్మీ అపర్ణ  తదితరులు పర్యవేక్షించారు.

వైభవంగా వీణాఝరి - 02.02.2025

వైభవంగా వీణాఝరి 

బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం  రాత్రి వీణామరి కార్యక్రమం వైభవంగా జరిగింది. రామరాజు పౌండేషన్, రామరాజు ఇన్‌ఫ్రా డెవలపర్స్ నిర్వహణలో సంస్థ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాస్ దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం కళాని పంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఆర్.లక్ష్మి శ్రీనివాస్ వీణ కచేరీలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎ. భారతీదేవి, బి. వంశీకృష్ణ, అయ్యగారి సత్యప్రసాద్, కె. శశిధర్, కె. హేమలక్ష్మి, ఎస్వీఎస్ కేఎస్ గోవిందరాజన్, బి. మధురిమ వీణ కచేరీలు చేశారు. ప్రధాన కచేరీలో భాగంగా ప్రముఖ వీణ విద్వాంసుడు సుడు వడలి ఫణినారాయణ వీణ కచేరీ చేశారు. వడలి ఫణి నారాయణకు పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కారాన్ని రామరాజు శ్రీనివాస్ దంపతులు, ముఖ్యఅతిథిగా పొల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, డాక్టర్ భూసురపల్లి వెంక టేశ్వర్లు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్యలు ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం వీణాఝరిలో పాల్గొన్న వీణా విద్వాంసులు, వాద్య కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...