ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిరుల కల్పవల్లీ వందనం - 26.09.2025

సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి. 

వైభవంగా గోదారంగనాథస్వామి వార్ల కళ్యాణం - 13.01.2025

 వైభవంగా గోదారంగనాథస్వామి వార్ల కళ్యాణం


స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని గుంటూరు తిరుమల గోదాదేవి పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భోగి సందర్భంగా శ్రీకృష్ణుని అందంగా అలంకరించి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి చిన్నారులకు భోగిపండ్లను పోసి వేడుకగా జరిపారు. అనంతరం చివరి పాశురం ప్రవచనానంతరం అన్నమయ్య కళావేదికపై టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో 30 రోజులపాటు నిర్వహించిన తిరుప్పావై ముగింపుగా బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ, ఆలయ పాలకమండలి వారు కోగంటి వెంకట శ్రీరంగనాయకిని ఘనంగా సత్కరించారు. అంగరంగ వైభవంగా గోదారంగనాయక స్వామి కల్యాణోత్సవం జరిగింది.  వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా గోదాదేవి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ అర్చకులు మాధవస్వామి బృందంచే ఎదురుకోలు, వర పూజ, పూర్ణాహుతి, నాగవల్లి సదస్యం, అప్పగింత కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






వైభవంగా పూర్ణాహుతితో ముగిసిన బృహత్తర చండీహోమం

భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో ధార్మిక ప్రాంగణంలో 16 రోజుల నుండి నిర్వహిస్తున్న బృహత్తర చండీయాగ కార్యక్రమం పుష్యపౌర్ణమి భోగి పండుగ రోజు సాయంత్రం విశేష పూర్ణాహుతితో ముగిసింది. వేద పండితుల వేదఘోషతో కార్యక్రమం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ పాలకమండలి వారు, అనేకమంది పురఃప్రముఖులు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను అందుకున్నారు. అనంతరం అన్నసమారాధన జరిగింది.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.