ఆకట్టుకున్న నృత్యాంజలి – 06.01.2025
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళావిపంచి హైదరాబాద్, కథక్ కళాక్షేత్ర, కళ పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన కళాకదంబం వీక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభకు కళ పత్రిక సంపాదకుడు డాక్టర్ మొహమ్మద్ రఫీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హాజరయ్యారు. కేసీపీ లిమిటెడ్ వైస్ చైర్మన్ డాక్టర్ వజ్జా మధుసూదనరావు, రామరాజు పౌండేషన్ అధ్యక్షడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మెన్ బాబు మిరియం, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్, మస్తానయ్య, తెనాలి బ్రేక్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అంజుబాబు, గురు బనీత నాగ్ శిష్యబృందం ప్రదర్శించిన కథక్ నృత్యం, గురు సుస్మిత మిశ్రా బృందం ఒడిస్సీ, తరంగిణి మ్యూజిక్, డాన్స్ అకాడమీ నిర్వాహకు రాలు పదజావిశ్వాస్ కూచిపూడి నృత్యం, బిజినా సురేంద్ర నాథ్ బృందం మోహినీ అట్టం ప్రదర్శనలు ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో కథక్ కళాక్షేత్ర అధ్యక్షుడు డాక్టర్ కథక్ అంజిబాబు, కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసిం హారావు, జీవీజీ శంకర్, డి.తిరుమలేశ్వరరావు, జి. మల్లి కార్జునరావు తదితరలు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి