మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మానవ ధర్మాలలో దైవ, పితృ, రుషి రుణాలను ధర్మంగా పరిగణించి ఆచరించాలన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాటను ధర్మంగా భావించి వనవాసానికి వెళ్ళాడన్నారు. మహాభారతంలో దమయంతి వృత్తాంతంలో భాగంగా బృహదశ్వుడు చెప్పిన నలుడి కథలో,నలుడు కూడా తన భార్యను, రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో కష్టాలు అనుభవించాడనీ,చివరికి అతను అన్ని కష్టాల నుండి బయటపడ్డారని తెలిపి ధర్మరాజుకు ఓర్పు, ధైర్యం నేర్పించాడన్నారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి