భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
నృత్యోత్సవాలు ప్రారంభం
‘గుంటూరు తిరుమల’ బృందావన్
గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై 15.11.2024 గురువారం రాత్రి
శ్రీసాయి మంజీర కూచిపూడి. ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కాజ సత్యవతీ దేవి
లక్ష్మీనరసింహారావు స్మారక బాల కళావేదిక 12వ చిల్డ్రన్ డాన్స్
ఒలింపియాడ్ ప్రారంభమైంది. ఆలయ పాలక మండలి అధ్య క్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలు
ప్రారంభించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణని సత్క రించారు.
కాజ వెంకట సుబ్ర హ్మణ్యం తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి