కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.
నృత్యోత్సవాలు ప్రారంభం
‘గుంటూరు తిరుమల’ బృందావన్
గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై 15.11.2024 గురువారం రాత్రి
శ్రీసాయి మంజీర కూచిపూడి. ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కాజ సత్యవతీ దేవి
లక్ష్మీనరసింహారావు స్మారక బాల కళావేదిక 12వ చిల్డ్రన్ డాన్స్
ఒలింపియాడ్ ప్రారంభమైంది. ఆలయ పాలక మండలి అధ్య క్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలు
ప్రారంభించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణని సత్క రించారు.
కాజ వెంకట సుబ్ర హ్మణ్యం తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి