యమ, నచికేతుల సంవాదమే కఠోపనిషత్తు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వస్తున్న ఉపనిషత్ స్రవంతిలో కఠోపనిషత్ పై ఆధ్యా త్మిక ప్రవచనాలు శుక్రవారం ముగిశాయి. బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్మయమిషన్ సువీరానందస్వామి ప్రవచిస్తూ యముడు నచికేతుడిని ప్రాపంచిక సుఖాలు, సంపదలతో ప్రలోభపెట్టిన, అతను వాటన్నింటినీ తిరస్కరించి కేవలం ఆత్మజ్ఞానం కోసమే పట్టుబడతాడని అన్నారు. నచికేతుని వైరాగ్యానికి, జిజ్ఞాసకు సంతోషించిన యముడు శరీరం ఒక రథమైతే, ఆత్మ అందులోని రథికుడని వివరిస్తూ, జనన మరణాలు లేని నిత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడని పేర్కొన్నారు.
నృత్యోత్సవాలు ప్రారంభం
‘గుంటూరు తిరుమల’ బృందావన్
గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై 15.11.2024 గురువారం రాత్రి
శ్రీసాయి మంజీర కూచిపూడి. ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కాజ సత్యవతీ దేవి
లక్ష్మీనరసింహారావు స్మారక బాల కళావేదిక 12వ చిల్డ్రన్ డాన్స్
ఒలింపియాడ్ ప్రారంభమైంది. ఆలయ పాలక మండలి అధ్య క్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలు
ప్రారంభించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణని సత్క రించారు.
కాజ వెంకట సుబ్ర హ్మణ్యం తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి