సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
‘గుంటూరు తిరుమల’ బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం ఉదయం అమ్మవారు శ్రీ కామాక్షీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికగా యిమ్మడి అంజనీదేవి బృందం భక్తిమాల కార్యక్రమంలో అమ్మవారిపై అనేక కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. వీరికి వయోలిన్పై పాలపర్తి ఆంజనేయులు, తబలపై బాలాజి చక్కటి వాయిద్య సహకారం అందించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి