భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కార్తీకమాసం, మాసశివరాత్రి సందర్భంగా మంగళ వారం చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు.ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ దేవి శరన్నవరాతులలో భాగంగా 09.10.2024 బుధవారం సరస్వతీదేవి (మూలా నక్షత్రం) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో విద్యార్ధినీ విద్యార్ధుల పాల్గొని సరస్వతీదేవి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై శ్రీమతి కొండపి వసుంధర గారిచే అన్నమాచార్యుల సంకీర్తనల గానం వీనువిందుగా సాగింది.

.jpeg)





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి