‘గుంటూరు తిరుమల’లో వేంచేసి యున్న బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 03.10.2024 గురువారం శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములలో భాగంగా ఉదయం అమ్మవారు బాలాత్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య కళావేదికగా నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు తిరుమల తిరుపతి దేవస్థాన అన్నమయ్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనల గానం జరిగింది. తిరుమల గానగంధర్వ గురజాడ మధుసూదనరావు గారు అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా గానం చేసి ఆహుతులను అలరించారు. వీరికి కీబోర్డుపై మురళీకృష్ణ, తబలపై దేవశర్మ, రిథమ్స్పై శ్రీనివాస్ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తెలియజేశారు. అమ్మవారికి హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. కె. సూర్యనారాయణ గారి నిర్వహణలో కార్యక్రమం జరిగింది.
తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు. సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి