‘గుంటూరు తిరుమల’లో వేంచేసి యున్న బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 03.10.2024 గురువారం శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములలో భాగంగా ఉదయం అమ్మవారు బాలాత్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య కళావేదికగా నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు తిరుమల తిరుపతి దేవస్థాన అన్నమయ్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనల గానం జరిగింది. తిరుమల గానగంధర్వ గురజాడ మధుసూదనరావు గారు అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా గానం చేసి ఆహుతులను అలరించారు. వీరికి కీబోర్డుపై మురళీకృష్ణ, తబలపై దేవశర్మ, రిథమ్స్పై శ్రీనివాస్ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తెలియజేశారు. అమ్మవారికి హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. కె. సూర్యనారాయణ గారి నిర్వహణలో కార్యక్రమం జరిగింది.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...







కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి