మూత్ర సమస్యలపై అవగాహన అవసరం మూత్ర సంబంధిత సమస్యలపై వయోవృద్ధులు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ ఆరె అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగ ణంలోని అన్నమయ్య కళావేదికపై గుంటూరు జిల్లా సీని యర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూత్ర సమస్య లపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కార్తీక్ ఆరె, డాక్టర్ చేకూరి సింధుశ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూత్ర సమస్యలపై అవగాహన కల్పించారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి