ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం - 04.11.2025

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నిర్వహించిన అభిజ్ఞాన శాకుం తలం నృత్యరూపకం ఆకట్టుకుంది. మహాకవి కాళిదాసు జయంతి సందర్భంగా సంస్కృత భారతి గుంటూరు శాఖ, శ్రీ సాయిమంజీర కూచి పూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలోని సన్నివేశాలను డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో విద్యార్థినులు అభినయం చారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. వరప్రసాదమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, హిందూ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహదీక్షిత్, గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి, పత్రి వేణుగోపాల్, విభాగ సంయోజక్ పెసల దేవేంద్రగుప్తా, ఉదయ కిరణ్, జన్నాభట్ల ఉమా, ఫణికామేశ్వరి తదితరులు ప్రసంగించారు.
  స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ కే.ఆర్.కే.ఎం. మెమోరియల్ అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 15.09.2024 ఆదివారం అమరావతి నాట్యోత్సవాలలో భాగంగా   నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి శిష్య బృందం పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని , ప్రముఖ నాట్యచారి సత్యనారాయణరాజు   రామ కథ లోని ప్రధాన ఘట్టాలను భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
  ‘గుంటూరు తిరుమల’లో వేంచేసి యున్న  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై 2024 సెప్టెంబరు నెల జరుగు కార్యక్రమములు
  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటి ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ ధార్మిక ప్రాంగణంలో గణేష్ ఉత్సవమండలి నిర్వహణలో బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.