ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన - సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 28.07.2025

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.
  స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ కే.ఆర్.కే.ఎం. మెమోరియల్ అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 15.09.2024 ఆదివారం అమరావతి నాట్యోత్సవాలలో భాగంగా   నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి శిష్య బృందం పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని , ప్రముఖ నాట్యచారి సత్యనారాయణరాజు   రామ కథ లోని ప్రధాన ఘట్టాలను భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
  ‘గుంటూరు తిరుమల’లో వేంచేసి యున్న  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై 2024 సెప్టెంబరు నెల జరుగు కార్యక్రమములు
  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటి ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ ధార్మిక ప్రాంగణంలో గణేష్ ఉత్సవమండలి నిర్వహణలో బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.